తెలంగాణ,Artificial Intelligence : తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన.. ఒకటో తరగతి నుంచే AI పాఠాలు! – telangana government planning to awareness to students about artificial intelligence ai from 1st class

Written by RAJU

Published on:

Telangana Govt : ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిక యుగం. అందుకు తగ్గట్లుగా విద్యారంగం కూడా మారాల్సిన అవసరం ఉంది. అదే పనిలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి.. నేటి ఆధునిక కాలానికి తగ్గట్లు విద్యా ఉండాలనే యోచన చేస్తోంది. అందుకు తగ్గట్లుగానే నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మరో సరికొత్త ఆలోచన దిశగా కార్యాచరణ ప్రారంభించింది. వివరాల్లోకెళ్తే..

Samayam Teluguఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌

Telangana Government : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై దృష్టిసారించింది. సరికొత్త నిర్ణయాలతో కొత్తపుంతలు తొక్కించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో 1వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (artificial intelligence) సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26)లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గణితంలో ఒక పాఠంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)ని చేర్చే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

1-5 తరగతుల వరకు 2-3 పేజీల్లో.. 6 నుంచి 9వ తరగతి వరకు 4-5 పేజీల్లో ఏఐ లెసన్‌ ఉండేలా రూపకల్పన చేస్తోంది. విద్యాశాఖ అధికారలు, ఎస్‌సీఈఆర్‌టీ సబ్జెక్టు నిపుణులతో ఏఐ పాఠ్యాంశాలను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ పాఠ్యాంశాలు సిద్ధమయ్యేందుకు 15-20 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. కంప్యూటర్, ఏఐ పుట్టుపూర్వోత్తరాలు, ఉపయోగాలు, విద్యార్థులు అర్థం చేసుకునేలా కొన్ని ఉదాహరణలు చేర్చనున్నారు. సీబీఎస్‌ఈ (CBSE)లో దాదాపు నాలుగేళ్ల క్రితమే 6 తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) పాఠాలు చేర్చిన విషయం తెలిసిందే.

మైక్రోసాఫ్ట్‌ అడ్వాంటేజ్‌ ఇండియా (ఏఐ) ఫౌండేషన్‌తో ఒప్పందం

ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే డిజిటల్‌ నైపుణ్యాలను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇటీవల మైక్రోసాఫ్ట్‌ అడ్వాంటేజ్‌ ఇండియా (ఏఐ) ఫౌండేషన్‌ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 500 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో చదువుతున్న 50 వేల మంది విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, నిపుణులు పాఠాలు చెప్పనున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్‌ బోధన జరుగుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పాఠాలను ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల ఎంపిక కోసం ఉన్నతాధికారులు జిల్లాలోని ఉపాధ్యాయుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ‘‘రెండు నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల సెల్‌ఫోన్లలో గేమ్‌లను వేగంగా ఆడుతున్నారు. కామిక్‌ షోలు చూస్తున్నారు. వీరు ఏఐ పాఠాలను సులభంగానే అర్థం చేసుకోగలరు’’ అని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అధికారులు.. కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఉన్న స్కూళ్లను ప్రాథమికంగా ఎంపిక చేసి, వాటిల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య.. విద్యార్థుల్లో గ్రహణశక్తి, తెలివితేటల వివరాలపై ప్రభుత్వానికి నివేదించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలు, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేశారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification