Group 3 Results,TSPSC Group 3 Results : తెలంగాణ గ్రూప్‌ 3 రిజల్ట్‌ 2025 విడుదల – telangana state public service commission tspsc group 3 result 2025 soon

Written by RAJU

Published on:

TSPSC Group 3 Results 2025 : తెలంగాణ గ్రూప్‌ 3 ఫలితాల విడుదలకు టీజీపీఎస్సీ కమిషన్‌ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ అందుబాటులో ఉంది.

Samayam Teluguటీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 3 రిజల్ట్‌ 2025
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 3 రిజల్ట్‌ 2025

TSPSC Group 3 Result 2025 : తెలంగాణ (Telangana) గ్రూప్ 3 ఫలితాల విడుదల కోసం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో TSPSC గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు మార్చి 14న విడుదల చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2024 నవంబర్ 17, 18 తేదీల్లో TSPSC గ్రూప్ 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల 36 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.69 లక్షల మంది పరీక్షలు రాశారు. వారంతా ప్రస్తుతం Group 3 ఫలితాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

జూనియర్ అసిస్టెంట్, ఎల్డీ స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, తదితర 1365 గ్రూప్‌ 3 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్ష నిర్వహించారు. తాజాగా TSPSC గ్రూప్ 3 ఫలితాలు 2025 కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులతో పాటు విడుదల చేశారు. కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవడానికి షార్ట్‌ లిస్ట్ చేయబడతారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://www.tspsc.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. రిజల్ట్‌ చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

ఈ ఫలితాలు విడుదలయ్యాక అభ్యర్థులు వారి రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి ఫలితాలను పొందొచ్చు. మరోవైపు టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 రిజల్ట్‌ వెల్లడికి కూడా కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మూల్యాంకన పూర్తయినట్లు సమాచారం. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఒకటికి రెండు సార్లు రీ వెరిఫికేషన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ గ్రూప్ 3 కటాఫ్ మార్కులు (TSPSC Group 3 Expected Cut Off Marks)

TSPSC గ్రూప్ 3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కటాఫ్ మార్కులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ https://tspsc.gov.in/ ద్వారా ఫలితాలతో పాటు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు కమిషన్ విడుదల చేసిన కనీస కటాఫ్ మార్కులను సాధించాలి. పరీక్షలో కనీసం 40 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు తదుపరి రౌండ్ ఎంపికకు అర్హులయ్యే అవకాశం ఉంది.

కేటగిరిల వారీగా Expected కటాఫ్ మార్కులు

  • జనరల్ అభ్యర్థులు 190 నుంచి 200
  • ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 185 నుంచి 195
  • ఓబీసీ అభ్యర్థులు 175 నుంచి 180
  • ఎస్సీ అభ్యర్థులు 155 నుంచి 165
  • ఎస్టీ అభ్యర్థులు 165 నుంచి 175
  • పీడబ్ల్యూడీ అభ్యర్థులు 145 నుంచి 160
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification