India Post GDS Recruitment Notification 2025 : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవాలనుకునే వారికి భారత తపాలా శాఖ గుడ్న్యూస్ చెప్పింది. వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2025
- దేశవ్యాప్తంగా 21,413 ఖాళీల భర్తీకి ప్రకటన
- ఏపీ సర్కిల్ పరిధిలో 1215 పోస్టుల భర్తీ
- 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అర్హులు

ఇతర ముఖ్యమైన సమాచారం:
- విద్యార్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
- వయసు: 18- 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380.. ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ఉమెన్లకు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
- దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్ సర్కిల్లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయనే విషయాన్ని గమనించాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: ఫిబ్రవరి 10, 2025
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 3, 2025
- దరఖాస్తు సవరణలకు అవకాశం: మార్చి 6 నుంచి 8 వరకు.
ఎంపిక విధానం:
10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థుల నియామకం ఉంటుంది. నోటిఫికేషన్లో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు జాగ్రత్తగా గమనించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ 1 తర్వాత దానికి ఆప్షన్ 2.. ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం అందుతుంది.