India Post : 21,413 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 10th Class పాసైన అమ్మాయిలు, అబ్బాయిలు త్వరపడండి!

Written by RAJU

Published on:

indiapost.gov.in Recruitment : భారత తపాలా శాఖ భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమై కొనసాగుతోంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..

హైలైట్:

  • ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
  • 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీకి ప్రకటన
  • మార్చి 3 దరఖాస్తులకు చివరితేదీగా నిర్ణయం
Samayam Teluguఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ జాబ్స్‌
ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ జాబ్స్‌

India Post GDS Recruitment 2025 : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1215 పోస్టులు, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి పాసైన అమ్మాయిలు, అబ్బాయిలు ఈ GDS పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 3వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి లింక్‌ ఇదే. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

విద్యార్హతలు- వయసు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన అభ్యర్థులు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. ఇక వయసు విషయానికొస్తే.. 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి.. తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్‌ 1 తర్వాత దానికి ఆప్షన్‌ 2.. ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైన వారికి ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ లేదా పోస్టు ద్వారా సమాచారం అందజేస్తారు.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏదైనా ఒక పోస్టల్‌ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్‌ సర్కిల్‌లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు దరఖాస్తు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ ఉద్యోగాలకు జీతం ఎంతంటే?

ఇండియా పోస్ట్‌లో వెలువడిన నియామకాల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్టల్ సర్వెంట్ల పోస్టుల ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ పోస్టుకు జీతం రూ. 12,000 నుండి రూ. 29,380 వరకు ఉంటుంది, అయితే బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, పోస్టల్ సర్వెంట్‌లకు వేతన శ్రేణి రూ. 10,000 నుండి రూ. 24,470 వరకు ఉంటుంది. ఇది కాకుండా.. ఉద్యోగులకు ప్రాథమిక వేతనంతో పాటు డీఏ కూడా లభిస్తుంది. మరిన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification