నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel)లో 18వ రోజు మంగళవారం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రం రోబోస్ (Robos) వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టిబీయం (TBM) కటింగ్లో రైల్వే సిబ్బంది (Railway workers) నిమగ్నమైంది. D1, D2 లో మృతదేహాల ఆచూకీ కోసం ర్యాట్ మైనర్స్, సింగరేణి కార్మికులు త్రవ్వకాలు జరుపుతున్నారు. గల్లంతు అయిన కార్మికులను గుర్తించడంలో పురోగతి కనిపిస్తోంది. స్నిపర్ డాగ్స్ కార్మికుల ఆనవాళ్లను గుర్తించాయి. జీపీఆర్ అలాగే డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో రెస్క్యూ టీమ్ తవ్వుతున్నారు.
Also Read..:
విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో.. 16 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్సింగ్గా గుర్తించారు. ఆయన స్వస్థలం పంజాబ్లోని చీమాకలాన్. కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ డాగ్స్ గుర్తించిన చోటే.. గురుప్రీత్ మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి సహాయక బృందాలకు ఓ చేయి కనిపించగా.. కాంక్రీట్ మాదిరిగా గట్టిపడ్డ మట్టిలోంచి.. దెబ్బతినకుండా మృతదేహాన్ని తీసేందుకు సహాయక బృందాలు సుమారు 12 గంటల పాటు శ్రమించాయి. మృతదేహం నిలువున ఉన్నట్లు గుర్తించి, 12 అడుగుల మేర తవ్వకాలు జరిపాయి. టీబీఎంకు చెందిన వ్యర్థాలను సైతం.. ఏడు లేయర్ల మేర తొలగించాక, గురుప్రీత్సింగ్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మృతదేహాన్ని తీయగా.. 6 గంటలకు టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చి, పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో నాగర్కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రే పోస్టుమార్టం ప్రక్రియ పూర్తవ్వగా.. మృతదేహాన్ని పంజాబ్కు తరలించారు. గత సోమవారం నుంచి గాలింపును తీవ్రతరం చేయగా.. జీపీఆర్ రాడార్లు, ఆక్వా-ఐ యంత్రాలు, స్నిఫర్ డాగ్స్, కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ శునకాలను వినియోగించారు. జీపీఆర్ గుర్తించిన ఐదు ప్రాంతాల్లో కొన్ని చోట్ల తవ్వకాలు జరిపినా.. గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. గురువారం రంగంలోకి దిగిన క్యాడవర్ డాగ్స్ రెండు ప్రాంతాలను గుర్తించాయి. వాటిల్లో ఓ ప్రాంతం ప్రమాద స్థలికి చేరువలో ఉంది. సింగరేణి, ర్యాట్ మైనర్లు చెరో ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. శనివారం రాత్రి ఓ చేయి ఉన్నట్లు ఎన్డీఆర్ఎ్ఫ అసిస్టెంట్ కమాండెంట్ హరీశ్ గుర్తించడంతో.. తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతం టన్నెల్లో 13.8 కిలోమీటర్ల దూరంలో.. టీబీఎంకు 50 మీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మరో ప్రాంతం టీబీఎంకు 16 మీటర్ల దూరంలో ఉంది. ఆదివారం ఈ శునకాలు మరో రెండు ప్రాంతాలను గుర్తించాయి. ఈ మూడు చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ ప్రాంతం సున్నితంగా ఉందని సింగరేణి మైనర్లు చెబుతున్నారు. ఈ 3 ప్రాంతాలు టీబీఎం నుంచి 10-16మీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ ఊట నీటిని తొలగిస్తుండగా.. మిగతా మట్టి కాంక్రీట్ మాదిరిగా గట్టిగా తయారవుతూ తవ్వకాలకు ఆటంకంగా మారిందని వివరిస్తున్నారు. దీంతో.. సహాయక బృందాలపై పైనుంచి మట్టి పెళ్లలు కూలకుండా ఉండేందుకు దుంగలను తెప్పించారు. వీటిని సపోర్ట్గా వినియోగించి, తవ్వకాలు జరుపుతారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మూడు ప్రాంతాల్లో 15 అడుగుల మేర మట్టిని తవ్వాల్సి ఉందని అధికారులు చెప్పారు.
క్యాడవర్ డాగ్స్ రాక
టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు 16 రోజులుగా 12 ఏజెన్సీలకు చెందిన బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్ రాడార్, ఆక్వా-ఐ పరికరాలను గుర్తించినా.. గల్లంతైన వారిని గుర్తించడం సాధ్యం కాలేదు. దీంతో.. కేరళ పోలీసులు వినియోగించే క్యాడవర్ డాగ్స్ను రప్పించారు. బెల్జియం మెలినోయిస్ జాతికి చెందిన మాయ, మార్ఫి అనే శునకాలను కేరళ బృందాలు రంగంలోకి దింపాయి. కేరళలో ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువగా ఉండడంతో.. సుమారు 17 శునకాలను కొనుగోలు చేసి, వాటికి మానవ అవశేషాలను గుర్తించడంలో శిక్షణనిచ్చారు. ఇవి మానవ, జంతు కళేబరాల అవశేషాలను వేర్వేరుగా గుర్తిస్తాయి. నెలలు, సంవత్సరాలు దాటి.. ఎముకలు మాత్రమే భూగర్భంలో ఉన్నా.. ఇవి గుర్తిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
దళిత ద్రోహి జగన్
గ్రూప్-2 ర్యాంకింగ్ జాబితా విడుదల
For More AP News and Telugu News
Updated Date – Mar 11 , 2025 | 08:54 AM