ABN
, Publish Date – Apr 15 , 2025 | 02:03 AM
జిల్లాలో పనిచేస్తున్న ఐదో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల్లో 77 మందికి గ్రేడ్-4 ఉద్యోగ ఉన్నతులకు ఇటీవల కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశాలతో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకర్ రావులు కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు.

చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పనిచేస్తున్న ఐదో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల్లో 77 మందికి గ్రేడ్-4 ఉద్యోగ ఉన్నతులకు ఇటీవల కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశాలతో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకర్ రావులు కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉద్యోగ ఉన్నతులు పొందిన వీరికి పంచాయతీల కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, గ్రేడ్-6 నుంచి గ్రేడ్-5కు 63 మంది ఉద్యోగ ఉన్నతులపై ఇటీవల కౌన్సెలింగ్ జరిగింది. వీరికి కూడా ఈ వారంలోగా పంచాయతీల కేటాయింపులు జరుగుతాయని ఆ శాఖ అధికారి తెలిపారు.
Updated Date – Apr 15 , 2025 | 02:03 AM