Team India : టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. ఆటగాళ్లందరూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఎక్కారు. ఈ పర్యటనలో ముఖ్యంగా దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే.. భారత జట్టు కొత్త వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లడం. గిల్, గౌతమ్ గంభీర్తో కలిసి సాయంత్రం ఫ్లైట్లో వెళ్తారని వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ ముగ్గురూ కలిసి కనిపించడంతో అభిమానుల అనుమానాలు తొలగిపోయాయి.
ఆస్ట్రేలియాకు బయలుదేరిన భారత జట్టులో కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఇతర కీలక ఆటగాళ్లు ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ కూడా వీరితో పాటే ప్రయాణమయ్యారు. ఈ పర్యటన శుభ్మన్ గిల్కు 28వ భారత వన్డే కెప్టెన్గా మొదటి పరీక్ష కానుంది.
రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ప్రస్తుతం వన్-ఫార్మాట్ ప్లేయర్లుగా ఉన్నారు. వారు T20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరూ చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే మ్యాచ్ ఆడారు. ఆ ఐసీసీ టోర్నమెంట్ను రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకుంది. అయితే, ఇప్పుడు రోహిత్ నుంచి వన్డే కెప్టెన్సీని కూడా తీసుకుని శుభ్మన్ గిల్కు అప్పగించారు.
భారత్-ఆస్ట్రేలియా పూర్తి సిరీస్ షెడ్యూల్
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో మొత్తం 8 మ్యాచ్ల వైట్ బాల్ సిరీస్ (వన్డే, టీ20) ఆడనుంది.
వన్డే సిరీస్ షెడ్యూల్ (3 మ్యాచ్లు):
మొదటి వన్డే: అక్టోబర్ 19, పర్త్ (ఉదయం 9:00 )
రెండో వన్డే: అక్టోబర్ 23, అడిలైడ్ (ఉదయం 9:00)
మూడో వన్డే: అక్టోబర్ 25, సిడ్నీ (ఉదయం 9:00)
Rohit Sharma with team India after long time.🇮🇳🥹 pic.twitter.com/vhk9hZA9ND
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 15, 2025
టీ20 సిరీస్ షెడ్యూల్ (5 మ్యాచ్లు):
మొదటి టీ20: అక్టోబర్ 29, కాన్బెర్రా (మధ్యాహ్నం 1:45)
రెండో టీ20: అక్టోబర్ 31, మెల్బోర్న్ (మధ్యాహ్నం 1:45)
మూడో టీ20: నవంబర్ 2, హోబర్ట్ (మధ్యాహ్నం 1:45)
నాలుగో టీ20: నవంబర్ 6, గోల్డ్ కోస్ట్ (మధ్యాహ్నం 1:45)
ఐదో టీ20: నవంబర్ 8, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 1:45)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..