గుజరాత్‌ రాజకీయాలలో సంచలనం.. సీఎం తప్ప మంత్రులందరు రాజీనామా

గుజరాత్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంటుండగా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులు తమ పదవుల నుంచి రాజీనామా చేశారు.అందిన సమాచారం ప్రకారం, ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ రాజీనామా చేశారు. తర్వాత మిగతా మంత్రులు ఒక్కక్కరు రాజీనామా చేశారు.అన్ని రాజీనామాలను విశ్వకర్మకు సమర్పించారు. విశ్వకర్మతో సహా మొత్తం 16 మంది మంత్రులు తమ పదవుల నుండి రాజీనామా చేశారు.ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఈ నిర్ణయం కేంద్ర నాయకత్వ ఆదేశాల ప్రకారం తీసుకోబడిందని వర్గాలు తెలిపాయి.

మంత్రులందరూ తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి..
ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు మంత్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు.తర్వాత, మంత్రులందరూ తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారు.
నివేదికల ప్రకారం, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ రాత్రి గవర్నర్‌తో సమావేశమై మంత్రుల రాజీనామాలను అధికారికంగా సమర్పించనున్నారు.ఈ చర్య, రాష్ట్రంలో జరిగే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ చర్య తీసుకోవచ్చని భావిస్తున్నారు.అయితే, ఇప్పటివరకు బీజేపీ లేదా ముఖ్యమంత్రి కార్యాలయం ఈ సంఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

రేపు మంత్రివర్గ విస్తరణ
నివేదికల ప్రకారం, శుక్రవారం ఉదయం 11:30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావనున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప రాష్ట్రంలోని 16 మంది మంత్రులు రాజీనామా చేయాలని సూచించారట.ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్రుల రాజీనామాలను గవర్నర్‌కు సమర్పిస్తారు. 2027లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Leave a Comment