ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ నేపథ్యంలో, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ మంగళవారం సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నాలుగు సంస్థలకు ఇప్పటికే 10 ఎకరాల భూభాగం కేటాయించబడింది.
అందులో జీవీ ఎస్టేట్స్, మాలక్ష్మి ఇన్ఫ్రా, ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్, వరుణ్ హాస్పిటాలిటీ లు తమ-తమ ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
ఎవరికి, ఎక్కడ స్థలం కేటాయింపులు
జీవీ ఎస్టేట్స్ – మందడంలో
మాలక్ష్మి ఇన్ఫ్రా – మందడంలో
ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్ – తుళ్లూరులో
వరుణ్ హాస్పిటాలిటీ – లింగాయపాలెంలో
- స్థల కేటాయింపులు వివరాలు
జీవీ ఎస్టేట్స్, మందడం
సర్వే నెంబరు 195: 1.60 సెంట్లు
సర్వే నెంబరు 198: 90 సెంట్లు (పార్సిల్ నెంబరు 1) - మాలక్ష్మి ఇన్ఫ్రా, మందడం
సర్వే నెంబరు 223: 1 సెంటు
సర్వే నెంబరు 236: 2.49 సెంట్లు - ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్, తుళ్లూరు
సర్వే నెంబరు 188: 1 సెంటు
సర్వే నెంబరు 186: 2.49 సెంట్లు (పార్సిల్ నెంబరు 3)
రాజ్భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు
- వరుణ్ నోవాటెల్, లింగాయపాలెం
సర్వే నెంబరు 58: 26 సెంట్లు
సర్వే నెంబరు 156: 1.84 సెంట్లు
ఈ కేటాయింపులు ఈ నెల 8న జరిగిన సిఆర్డిఎ అథారిటీ 53వ సమావేశం, తీర్మానం నం. 589 ప్రకారం నిశ్చయించారు.
ఏపీ ప్రభుత్వం, రాజధాని కోర్ ఏరియాలో రాజ్ భవన్ నిర్మాణానికి ₹212.22 కోట్లు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేటాయింపు సిఆర్డిఎ 53వ సమావేశంలో 593వ తీర్మానం ప్రకారం అమలు చేయబడుతుంది.
ఇందులో గవర్నర్ మాన్షన్,అసెంబ్లీ దర్బార్ హాల్,గవర్నర్ ఆఫీస్,రెండు గెస్ట్ హౌస్లు నిర్మాణం చేయనున్నారు.
అదనంగా,అధికారులు,సీనియర్, జూనియర్ సిబ్బందికి అవసరమైన భవనాలు కూడా నిర్మించనున్నారు.
ఈ నిర్మాణ పనులకు సంబంధించి త్వరితంగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు.