ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభానికి ముందు, సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ను విడిచిపెట్టే అవకాశం ఉందని నివేదికలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025లో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే, అతను జట్టును విడిచిపెట్టిన తర్వాత, జట్టు కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడం రాజస్థాన్ రాయల్స్కు చాలా కష్టం అవుతుంది. ఐపీఎల్ 2026లో రియాన్ పరాగ్ లేదా యశస్వి జైస్వాల్ను రాజస్థాన్ జట్టుకు కెప్టెన్గా నియమించవచ్చని ఇటీవల మరొక నివేదిక వెలువడింది. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్లలో ఎవరు మంచి కెప్టెన్గా ఉండగలరో ఇప్పుడు తెలుసుకుందాం..
రియాన్ పరాగ్ కెప్టెన్సీ గణాంకాలు..
ఇటీవలే రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన నిష్క్రమణ తర్వాత జట్టులో మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక వర్గం యశస్వి జైస్వాల్ను తదుపరి కెప్టెన్గా చేయాలని భావిస్తుండగా, మరో వర్గం ప్రకారం రియాన్ పరాగ్కు ఈ బాధ్యత ఇవ్వాలని కోరుతోంది. మూడవ వర్గం సంజు శాంసన్ ఈ పదవిని చేపట్టాలని కోరుతోంది.
రియాన్ పరాగ్ గురించి చెప్పాలంటే, అతను అస్సాం జట్టుకు ఇప్పటివరకు 17 టీ20 ఫార్మాట్ మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. ఇందులో జట్టు 10 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇది మాత్రమే కాదు, సంజు శాంసన్ లేనప్పుడు అతను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు. అతను రాజస్థాన్ జట్టుకు 8 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. అందులో జట్టు కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే గెలిచింది.
ఇవి కూడా చదవండి
రియాన్ పరాగ్ కంటే చాలా వెనుకంజలో యశస్వి జైస్వాల్..
యశస్వి జైస్వాల్ గురించి చెప్పాలంటే, అతను ఇంకా దేశీయ, ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించలేదు. అతను ఆటగాడిగా చాలా బాగా రాణించాడు. కానీ, అతనికి కెప్టెన్సీ అనుభవం లేదు. ఇద్దరి కెప్టెన్సీ రికార్డు గురించి మాట్లాడుకుంటే, రియాన్ పరాగ్ యశస్వి కంటే చాలా ముందున్నాడు. 2026 సీజన్లో సంజు శాంసన్ రాజస్థాన్ను విడిచిపెడితే, ఫ్రాంచైజీ జట్టు కమాండ్ను రియాన్ పరాగ్కు అప్పగించవచ్చు. ఎందుకంటే, అతనికి యశస్వి కంటే ఎక్కువ కెప్టెన్సీ అనుభవం ఉంది. ఇప్పుడు రాజస్థాన్ తన జట్టు కెప్టెన్సీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..