ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్కు గట్టి పోటీ ఇస్తోంది. అదిరే ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేకమైన రూ. 299 ప్లాన్ను తిరిగి ప్రవేశపెట్టింది. గతంలో ఈ ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా మాత్రమే లభించేది.. కానీ ఇప్పుడు దాని ప్రయోజనాలు రెట్టింపు అయ్యాయి. దీనితో ఈ ప్లాన్ ఇప్పుడు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తోంది.
డబుల్ ధమాకా ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో ఈ ప్లాన్ గురించి ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్తో రూ. 299 రీఛార్జ్ ప్యాక్లో వినియోగదారులు 30 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను పొందుతారు. దీని ప్రకారం, ఒక నెలలో మొత్తం 90 జీబీ డేటా లభిస్తుంది. సాధారణంగా చాలా ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. కానీ ఈ ప్యాక్ పూర్తి 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. డేటాతో పాటు ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి. ఇంత తక్కువ ధరలో ఈ స్థాయిలో ప్రయోజనాలను జియో లేదా ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ సంస్థలు అందించలేకపోతున్నాయి. అందుకే ధరల పెరుగుదల తర్వాత చౌకైన ప్లాన్ల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్ ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.
మరో చౌకైన ప్లాన్
రూ. 299 ప్లాన్ మీకు ఖరీదైనదిగా అనిపిస్తే, బీఎస్ఎన్ఎల్ మరొక చౌకైన ప్లాన్ను కూడా అందిస్తోంది. రూ. 199 ప్లాన్తో మీరు 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్లో రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా అందుబాటులో ఉంటాయి. రూ. 200 లోపు ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ను కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. బీఎస్ఎన్ఎల్ ఈ రెండు ప్లాన్లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ తన వినియోగదారులను పెంచుకోవాలని చూస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..