నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన హత్యకు కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేశారు. TV9 న్యూస్తో మాట్లాడుతూ.. తనను చంపడానికి కోట్ల రూపాయలు అందిస్తున్నారని రౌడీషీటర్లు మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఈ కుట్రలో పాత్ర పోషించిన వారిని పోలీసులు వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రౌడీషీటర్ల బెదిరింపులకు తాను భయపడనని, తాను భయపడి రాజకీయాలు చేసే వ్యక్తి కాదని కోటం రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం