జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలయిక సహజం. అయితే ఆగస్టు నెలలో కొన్ని రాశుల వారికి చాలా సమస్యలు ఎదురు కానున్నాయి. ఎందుకంటే? ఆగస్టు నెలలో సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో కేతవు సంచరిస్తున్నందున ఈ రెండు గ్రహాల కలయికతో దరిద్రయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం నాలుగు రాశులపై అధికంగా ఉండనున్నదంట.
సింహ రాశి : సింహ రాశి వారికి తన సొంత రాశిలో కేతువు, సూర్య గ్రహాల కలయిక వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి.ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రావడం, ఏ పని చేసినా అంది కలిసి రాకపోవడ వంటి వాటితో ఇబ్బందులు ఎదర్కొంటారంట. అందుకే వీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.
మేష రాశి : మేష రాశి వారికి దరిద్ర యోగం ప్రభావంతో ఇంట్లో అశాంతి నెలకొంటుందంట. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురు అవుతాయంట. వ్యాపారల్లో నష్టాలు, కుటుంబంలో కలహాలతో సతమతం అవుతారంట. అంతే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతినే ఛాన్స్ ఉన్నదంట.
వృషభ రాశి : వృషభ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. సూర్య , కేతువుల కలయిక వలన వీరు ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో సతమతం అవుతారంట. ముఖ్యంగా ఆందోళన ఎక్కువ అవుతుందంట. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురు అవుతాయి. అందువలన వీరు చాలా జాగ్రత్తగా మెదలడం మంచిదంట.
ధనస్సు రాశి : సూర్య, కేతువు గ్రహాల కలయిక వలన దరిద్ర యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ధనస్సు రాశిపై అధికంగా ఉంటుందని చెబుతున్నారు పండితులు. దీంతో వీరికి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతారంట. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకోవాలంట.