హైదరాబాద్‌లో జాబ్‌ కోసం ట్రై చేస్తున్నారా? BEL సంస్థలో పర్మనెంట్‌ ఉద్యోగాలు.. రూ.90,000 వరకు జీతం

Written by RAJU

Published on:

BEL Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌ విభాగం పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే..

హైలైట్:

  • బెల్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
  • 32 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • ఏప్రిల్‌ 9 దరఖాస్తులకు చివరితేది
Samayam Teluguభారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ జాబ్స్‌
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ జాబ్స్‌

BEL Hyderabad Recruitment 2025 : ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్ ప్రాంగణంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 32 పోస్టుల భర్తీ చేపట్టనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్ 9వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్‌ చూడొచ్చు. అలాగే.. అప్లయ్‌ చేసుకోవడానికి అప్లికేషన్‌ లింక్ ఇదే. మరికొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు చెక్‌ చేసుకోవాలంటే లింక్ ఇదే. మొత్తం ఖాళీల సంఖ్య: 32
  • ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ ట్రైనీ (ఈఏటీ): 08
  • టెక్నీషియన్‌ సీ: 21
  • జూనియర్‌ అసిస్టెంట్: 03

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
  • వయోపరిమితి: 1.03.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • జీతం: నెలకు టెక్నీషియన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌కు రూ.21,500 – రూ.82,000, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ట్రైనీకి రూ.24,500 – రూ.90,000 వరకు ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 9, 2025

మరో 20 సీనియర్ డిప్యూటీ ఇంజినీర్‌ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మచిలిపట్నంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 20 సీనియర్‌ డిప్యూటీ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మొత్తం పోస్టులు సంఖ్య: 20

  • డిప్యూటీ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌): 08
  • డిప్యూటీ ఇంజినీర్‌ (మెకానికల్‌): 12

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ ఉత్తీర్ణత ఉండాలి.
  • వయో పరిమితి: 01.02.2025 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు.. ఒబీసీలకు 31 ఏళ్లు.. ఎస్సీ/ ఎస్టీ వారికి 33 ఏళ్లు ఉండాలి.
  • జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది. (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి ఫిజులో మినహాయింపు ఉంటుంది).
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2025
కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification