
నవతెలంగాణ – గోవిందరావుపేట
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించుకోవచ్చు పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో జామా మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటును ఎస్ఐ కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ.. జమా మసీద్ లో గ్రామానికి చెందిన జాకిర్ హుస్సేన్, మున్నీర్ బాషా, అస్రాఫ్ అలీ మరికొందరు కలిసి మసీదులో సిసి కెమెరాలు ఏర్పాటు చేయటం మంచి కార్యక్రమం అన్నారు., దానిని సి సి కెమెరాలు నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని, మీ పరిసర ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేసుకోవడం వల్ల అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఇవి చాలా ఉపయోగకరమని, మసీదు లొ, కెమెరా ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అని, మండలంలోని, అన్ని గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో, మరియు గ్రామాల్లోని ప్రతి షాపుల ముందు , సి సి, కెమెరాలు పెట్టుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని, కమలాకర్ గారు తెలిపారు, ఈ సిసి కెమెరాల ఏర్పాటులో , మండలంలోని ప్రజలు, వ్యాపారస్తులు, యువత, సహకరించాలని తెలిపారు.