పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల వాయిదా పడింది. సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని మొదట ఈనెల 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇంకా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నందున విడుదలను వాయిదా వేశారు. మే 9వ తేదీన థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్లో పవర్ స్టార్ కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు మే 9వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టనున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. భారీ, సోలో విడుదల కావడంతో ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
కరోనా మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమైనప్పటికీ చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ఎ.ఎం.జ్యోతి కష్ణ ఎక్కడా రాజీ పడకుండా వేగంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్లను రూపొందించారు. ప్రతిభ గల ఈ సాంకేతిక బందం, ప్రేక్షకులకు వెండితెరపై మరపురాని అనుభూతిని అందించబోతోంది. పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు.
మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్, డాకు మహారాజ్ చిత్రాలతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ప్రతినాయక పాత్రలో మరోసారి తనదైన ముద్ర వేయనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జిషు సేన్గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది.

వీరమల్లు..విడుదల వాయిదా
Written by RAJU
Published on: