వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులు చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా ఏప్రిల్ 10వ తేదీన జరిగిన బోర్డులో చేసిన తీర్మానాలకు అనుగుణంగా భూముల పలు సంస్థలకు భూ కేటాయింపులకు క్యాబినెట్ అమోదం తెలిపింది. పెట్టుబడులు, సమగ్ర ప్రాజెక్టులతో ముందుకు వచ్చే సంస్థలకు వాటికి అవసరమైన భూముల కేటాయింపు, సక్రమంగా ఆమోదించడం,మౌలిక వసతులను కల్పించడం మరియు సంబంధిత విధి విధానాల ప్రకారం ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీని విస్తరించడం వంటి అంశాలపై పరిశ్రమలు, వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదించింది.