లక్ష్మీదేవి కృప పొందాలంటే పొరపాటున కూడా మహిళలు ఈ తప్పులు చేయకండి..!

Written by RAJU

Published on:

లక్ష్మీదేవి కృప పొందాలంటే పొరపాటున కూడా మహిళలు ఈ తప్పులు చేయకండి..!

ఇంట్లో శ్రేయస్సు, ధనసంపద నిలిచి ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కొన్ని శుభాచారాలను పాటించడం ఎంతో అవసరం. పురాణాల ప్రకారం కొన్ని అలవాట్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు ఉపకరిస్తాయి. అలాగే కొన్ని పొరపాట్లు ఆమె ఆగ్రహానికి కారణమవుతాయని చెబుతారు. ముఖ్యంగా మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటిని శుభ్రంగా ఉంచడం

ఇంటి పరిశుభ్రత అన్నది శుభశక్తులను ఆకర్షించే ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేయడం వల్ల ధనసంపద నిలిచి ఉంటుందని నమ్ముతారు. అలాగే తులసి మొక్కను పూజించడం, ప్రతిరోజూ దాని దగ్గర దీపం పెట్టడం శుభప్రదంగా ఉంటుంది.

సూర్యభగవానుడికి అర్పణ

ఉదయాన్నే సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం ఇంటికి మంచి చేస్తుందని నమ్ముతారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇంటి ద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తు వేసి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ధనసంపద పెరుగుతుందని చెబుతారు.

శుభపరిస్థితులు

ప్రతిరోజూ భగవంతుడిని పూజించడం, ధూపం, దీపారాధన చేయడం ఇంటికి శాంతిని తీసుకొస్తుంది. ప్రతికూలమైన ఆలోచనలను దూరంగా ఉంచి ఆధ్యాత్మికంగా పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడం ద్వారా ఇంట్లో ఆనందం, సమృద్ధి పెరుగుతాయి.

జుట్టును విడదీయకండి

సాయంత్రం సమయంలో జుట్టును అలా విడచి ఇంట్లో తిరగడం శుభం కాదని పెద్దలు చెబుతారు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని.. ఇంట్లో శుభవాతావరణం తగ్గిపోతుందని నమ్మకం. అందుకే సాయంత్రం వేళ జుట్టును విడచి ఇంట్లో తిరగకండి.

ద్వారం దగ్గర కూర్చోవడం

ఇంటి ప్రధాన ద్వారం శుభశక్తులు ప్రవేశించే మార్గం. అక్కడ కూర్చోవడం వల్ల అదృష్టాన్ని అడ్డుకుంటుందని చెబుతారు. ముఖ్యంగా మహిళలు ప్రధాన ద్వారం దగ్గర భోజనం చేయడం ఎక్కువ సమయం గడపడం అనేది కుటుంబంలో ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఆలస్యంగా నిద్ర లేవడం

ఉదయాన్నే లేవడం శరీరానికి మంచికే కాకుండా.. మనసుకు కూడా శాంతిని కలిగిస్తుంది. పూర్వకాలం నుండి పెద్దలు తెల్లవారుజామున నిద్రలేవడం శుభప్రదమని చెబుతారు. ఆలస్యంగా నిద్రలేస్తే రోజంతా అలసటగా అనిపించడమే కాకుండా.. పనులపై సమయానుసారంగా దృష్టి పెట్టలేము. ముఖ్యంగా సూర్యోదయ సమయంలో లేవడం ఆరోగ్యానికీ ఆధ్యాత్మికంగా మంచిదని చెబుతారు. అదే అలవాటు చేసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉంటాము.

వీరిని అవమానించకండి

భిక్షువులు లేదా సన్యాసులు ఇంటికి వచ్చినప్పుడు వారికి గౌరవంగా స్వాగతం చెప్పాలి. వారిని ఖాళీగా పంపడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోవడానికి కారణమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ధనం ఉండేవారు ఇతరులను ఆదుకుంటే అదృష్టం పెరుగుతుందని నమ్మకం.

ఇంట్లో గొడవలు

ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలని లక్ష్మీదేవి కోరుతుందనీ.. ఇళ్లలో కలహాలు ఎక్కువైతే ఆమె అక్కడ ఉండదని చెబుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం, ఓర్పు ఉంటే ఇంట్లో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి.

Subscribe for notification