రైల్వేలో 11,558 RRB NTPC ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష విధానం ఇలా!

Written by RAJU

Published on:

RRB NTPC Exam Date News 2025 Live : ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రాత పరీక్ష తేదీలు త్వరలో వెలువడనున్నాయి. ఆదిశగా ఆర్‌ఆర్‌బీ ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాల్లోకెళ్తే..

Samayam Teluguఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌ డేట్‌ 2025
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌ డేట్‌ 2025

RRB NTPC Exam Pattern 2025: ఇంటర్మీడియట్‌, డిగ్రీ అర్హతతో.. రైల్వేశాఖ (Indian Railway)లో నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (NTPC)లో మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. అలాగే.. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 3445 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. త్వరలో పరీక్షల తేదీలను ఆర్‌ఆర్‌బీ (Railway Recruitment Board) వెల్లడించనుంది. RRB NTPC ఇంటర్, డిగ్రీ పోస్టులకు పరీక్ష విధానం, సిలబస్‌ ఒకటే. అందువల్ల డిగ్రీ విద్యార్హత ఉన్నవారు రెండింటికీ పోటీ పడొచ్చు.

అయితే.. రెండింటికీ రాత పరీక్షలు మాత్రం విడిగానే నిర్వహిస్తారు. డిగ్రీతో పోలిస్తే ఇంటర్మీడియట్‌ పోస్టుల ప్రశ్నలు కొంచెం తక్కువ కఠినంగా ఉంటాయంతే. గ్రాడ్యుయేట్ పోస్టులకు ఎంపికైన ఉద్యోగాలకు లెవెల్‌-3 జీతం చెల్లిస్తారు. వీరికి రూ.21,700 మూలవేతనం ఉంటుంది. అన్నీ కలిపి సుమారు రూ.40 వేలు అందుకోవచ్చు. మిగిలినవి లెవెల్‌-2 ఉద్యోగాలు. వీటికి రూ.19,900 మూలవేతనం ఉంటుంది. అన్నీ కలిపి మొదటి నెల నుంచే సుమారు రూ.36,000 అందుకోవచ్చు.

RRB NTPC ఎంపిక ప్రక్రియ – పరీక్ష విధానం :

అన్ని పోస్టులకూ రెండు దశల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహిస్తారు. టైపిస్ట్‌ (అకౌంట్స్‌ క్లర్క్, జూనియర్‌ క్లర్క్‌) పోస్టులకు టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇక.. స్టేజ్‌-1 సీబీటీ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఈ 100 ప్రశ్నల్లో.. జనరల్‌ అవేర్‌నెస్‌ 40, మ్యాథమెటిక్స్‌ 30, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 30 ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 మార్కు కోత విధిస్తారు.

అలాగే.. స్టేజ్‌-2 పరీక్షలో భాగంగా.. స్టేజ్‌-1లో అర్హత పొందిన వారి నుంచి, కేటగిరీల వారీ ఉన్న ఖాళీలకు మెరిట్‌ ప్రకారం 15 రెట్ల మందిని స్టేజ్‌-2 పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో 120 ప్రశ్నలు.. 120 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. ఈ 120 ప్రశ్నల్లో జనరల్‌ అవేర్‌నెస్‌ 50, మ్యాథమెటిక్స్‌ 35, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 మార్కు కోత విధిస్తారు.

అనంతరం.. టైపిస్ట్‌ పోస్టులకు పోటీ పడేవారికి.. స్టేజ్‌-2లో అర్హుల జాబితా నుంచి మెరిట్‌ ప్రకారం కేటగిరీల వారీ ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో టైపింగ్‌ స్కిల్‌ టెస్టుకు ఎంపిక చేసి.. TYPING పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇంగ్లిష్‌లో నిమిషానికి 30 పదాలు టైప్‌ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షల్లో అన్‌ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యుఎస్‌ 40, ఓబీసీ ఎన్‌సీఎల్, ఎస్సీ 30, ఎస్టీ 25 శాతం మార్కులు పొందాలి. పీడబ్ల్యుడీలైతే వారి కేటగిరీ ప్రకారం అదనంగా మరో 2 శాతం మినహాయింపు ఉంటుంది. అలాగే.. ఇతర రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్లు, ముఖ్యమైన తేదీలు తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification