వెంకటాపురంలో ఉద్రిక్తత
సాయి ప్రకాశ్ హత్య నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో సోమవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సాయి ప్రకాశ్ హత్యకు కారణమైన దీపిక అనే మహిళపై మృతుడి బంధువులు, గ్రామస్థులు దాడికి ప్రయత్నించారు. దీంతో వారిని గమనించిన మహిళ ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గమనించి, ఆమెను బయటకు తీసుకుని వచ్చారు.