‘మధురం’ ఘన విజయం సాధించడం ఖాయం

Written by RAJU

Published on:

‘మధురం’ ఘన విజయం సాధించడం ఖాయంఉదయ్ రాజ్‌, వైష్ణవి సింగ్‌ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై రాజేష్‌ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం ‘మధురం’. ఎ మెమొరబుల్‌ లవ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. టీనేజ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో బంగార్రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదరు రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’ అని చెప్పారు. అనంతరం అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్‌, రఘు కుంచె, దర్శకులు విజరు కుమార్‌ కొండా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఇలాంటి ప్రయోగాత్మక ప్రేమకథలు రూపొందించడం కత్తిమీద సాములాంటిది. కానీ ట్రైలర్‌ చూశాక ఎమోషన్‌ బాగా వర్కవుట్‌ అయ్యిందని అనిపించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు. రఘుకుంచె మాట్లాడుతూ ”ఈ చిత్రంలోని పాటలన్నీ మధురాతి మధురంగా ఉన్నాయి. ట్రైలర్‌ కూడా చాలా బాగుంది. 90స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌ లవ్‌ స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉదరు రాజ్‌ హీరోగా మరిన్ని పెద్ద సినిమాలు చేయాలి. తనతోపాటు టీమ్‌ అందరికీ మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నా”అని అన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights