నవతెలంగాణ – కంఠేశ్వర్
క్యూరియస్ తైక్వాండో అకాడమీ బ్లాక్ బెల్ట్ వేడుకలకు విశిష్ట అతిథిగా డాక్టర్ పడకంటి రాముని అకాడెమీ హెడ్ కోచ్ వినోద్ నాయక్ ఆహ్వానించారు. డాక్టర్ రాము క్రీడాకారులకు బ్లాక్ బెల్టులు అందజేసి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని దేశం గర్వించేలా చేయాలని క్రీడాకారులను సూచించారు. ఈ సందర్భంగా నిజామాబాద్కు చెందిన ప్రముఖ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ రామును ఘనంగా సన్మానించారు. సామాజిక సేవకు ఆయన చేసిన విశేష కృషికి గానూ ఇటీవల అమెరికాలోని ఓ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. గంగాస్థాన్లోని క్యూరియస్ టైక్వాండో అకాడమీలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఛాంపియన్స్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ అకాడమీ క్రీడాకారులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో డాక్టర్ రామును శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో వినోద్ నాయక్ మాట్లాడుతూ, డాక్టర్ రాము సామాజిక సేవలో ఉన్న అంకితభావాన్ని కొనియాడారు మరియు డాక్టర్ రాము తన ప్రభావవంతమైన కృషితో మరెంతో మందికి స్పూర్తినిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. భారతదేశం మరియు విదేశాలలో కూడా అతనికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.సాదర స్వాగతం పలికిన వినోద్ నాయక్కు డాక్టర్ రాము కృతజ్ఞతలు తెలిపారు. వినోద్ నిరాడంబరమైన నిజమైన వ్యక్తి అని అభివర్ణించారు.
The post బ్లాక్ బెల్ట్ వేడుకలో పడకంటి రాముకి సన్మానం appeared first on Navatelangana.