ABN
, Publish Date – Apr 12 , 2025 | 01:40 AM
వార్షిక వసంతోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం బంగారు రథంపై దేవేరులతో కలిసి మలయప్ప ఊరేగారు. ఉదయం 8 నుంచి రెండు గంటలపాటు సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

స్వర్ణరథంపై ఊరేగుతున్న ఉత్సవర్లు
వార్షిక వసంతోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం బంగారు రథంపై దేవేరులతో కలిసి మలయప్ప ఊరేగారు. ఉదయం 8 నుంచి రెండు గంటలపాటు సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వసంత మండపంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవర్లను అభిషేకించారు. చివరిరోజు శనివారం శ్రీభూదేవి సమేత మలయప్పస్వామితో పాటు రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి, శ్రీసీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవర్లకూ స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
– తిరుమల, ఆంధ్రజ్యోతి
Updated Date – Apr 12 , 2025 | 01:40 AM