నీట్‌ అడ్మిట్‌ కార్డ్‌ 2025,NEET Admit Card 2025 : NTA నీట్‌ యూజీ 2025 అడ్మిట్‌ కార్డ్‌ విడుదల ఎప్పుడో తెలుసా? – neet ug admit card 2025 newest information

Written by RAJU

Published on:

nta.nic.in admit card 2025 : మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్‌ యూజీ 2025 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లలో ఎన్‌టీఏ నిమగ్నమై ఉంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసింది.

నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డ్‌ 2025
నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డ్‌ 2025 (ఫోటోలు– Samayam Telugu)

NEET UG Admit Card 2025 : దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 (NEET UG‌) ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను త్వరలో ఎన్‌టీఏ విడుదల చేయనుంది. మే 4వ తేదీన దేశవ్యాప్తంగా 552 కేంద్రాల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. అలాగే.. తాజాగా సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. నీట్‌ యూజీ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్‌ యూజీ అధికారిక వెబ్‌సైట్‌ https://neet.nta.nic.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి ఈ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ ద్వారా పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. వీటిలో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం వంటి తదితర సమాచారం ఉంటుంది. ఇది హాల్‌ టికెట్‌ కాదు.. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల చేయనున్నారు. ఎగ్జామినేషన్‌ ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో కానీ.. చెక్‌చేసుకోవడంలో కానీ ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థులు 011-40759000/ 011-69227700 నంబర్లలో లేదా neetug2025@nta.ac.in. ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

ఇక.. National Eligibility Cum Entrance Test NEET యూజీ 2025 పరీక్షను మే 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించన్నారు. నీట్‌ యూజీ 2025 పరీక్ష తొలుత ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. గతేడాది 24 లక్షల మంది అభ్యర్ధులు నీట్‌ యూజీ పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

మొత్తం 180 నిమిషాలు (3 గంటలు) పాటు నీట్ యూజీ 2025 రాత పరీక్ష ఉంటుంది. గతంలో ఉన్నట్టే ప్రతి సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు ఉంటాయి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ ఏడాది నీట్ యూజీ 2025 నుంచి మార్పులు చేసింది ఎన్‌టీఏ. తిరిగి పాత విధానాన్ని కొనసాగించేందుకు నిర్ణయించింది. అంటే సెక్షన్ బీ ఆప్షన్, అదనపు సమయం ఉండదు. అదనంగా 20 ప్రశ్నలు ఉండవు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అంటే ఇకపై 180 ప్రశ్నలకు మూడు గంటల సమయం ఉంటుంది. గతంలో ఉన్నట్టే ప్రతి సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలుంటాయి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నల చొప్పున ఉంటాయి. NEET UG పరీక్ష సిలబస్‌, పరీక్ష విధానం తదితర వివరాలు నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights