2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ ను తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను రూపొందించామని వెల్లడించారు. 2024-25కుగానూ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు ఉందని, రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉందని, మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కొందరు తప్పుడుప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పై పరోక్షంగా ఫైర్ అయ్యారు.
బడ్జెట్ కేటాయింపులు:

వ్యవసాయ శాఖ – రూ.24,439 కోట్లు
పశుసంవర్ధక శాఖ – రూ.1,674 కోట్లు
నీటిపారుదల – రూ.23,373 కోట్లు
అడవులు-పర్యావరణం – రూ.1,023 కోట్లు
రైతు భరోసా – రూ.18 వేల కోట్లు
వైద్యారోగ్యం – రూ.12,393 కోట్లు
విద్యుత్ – రూ.21,221 కోట్లు
ఉపాధి కల్పన – రూ.900 కోట్లు
విద్య – రూ.23,108 కోట్లు
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు
పారిశ్రామిక రంగం – రూ.3,525 కోట్లు
పౌర సరఫరాల శాఖ – రూ.5,734 కోట్లు
హోంశాఖ – రూ.10,188 కోట్లు
శాంతిభద్రతలు – రూ.10,188 కోట్లు
ఆర్ అడ్ బీ – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి – రూ.31,605 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి – రూ.17,677 కోట్లు
హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ – రూ.150 కోట్లు
చేనేత – రూ.371 కోట్లు, ఐటీ – రూ.774 కోట్లు
సాంస్కృతిక రంగం – రూ.465 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ – రూ.190 కోట్లు
క్రీడలు – రూ.465 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం – రూ.2,861 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి – రూ. 2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లకు – రూ.22,500 కోట్లు
గృహజ్యోతి, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కోసం – రూ.3 వేల కోట్లు