తెలంగాణ ఐసెట్‌ 2025 నోటిఫికేషన్‌,TGCHE టీజీ ఐసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే – tg icet 2025 notification for mba and mca programs details at tgche ac in

Written by RAJU

Published on:

TS ICET 2025 Exam Dates : తెలంగాణ ఐసెట్‌ 2025 నోటిఫికేషన్‌ మార్చి 6వ తేదీన విడుదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే.

Samayam Teluguతెలంగాణ ఐసెట్‌ 2025
తెలంగాణ ఐసెట్‌ 2025

TG ICET 2025 Notification : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్‌ 2025 నోటిఫికేషన్‌ గురువారం (మార్చి 6) విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు సమయంలో ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ. 550, బీసీలు, జనరల్‌ విద్యార్థులు రూ. 750 ఫీజుగా చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా మే 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం జూన్‌ 8, 9 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులకు పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://tgche.ac.in/ చూడొచ్చు.

తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ ఐసెట్-2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీఎస్ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవిలు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సహకారంతో నల్గొండ నుండి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే టీజీ ఐసెట్ 2025-26 ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 10వ తేదీ ప్రారంభమై.. మే 3వ తేదీ వరకు కొనసాగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

మార్చి 10 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 అపరాధ విషయంతో మే 17 వరకు అవకాశం కల్పించారు. రూ.500 అపరాధ రుసుముతో మే 26 వరకు అవకాశం కల్పించారు. అనంతరం ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మే 16 నుంచి 20 వరకు వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 షిఫ్టుల్లో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. జూన్ 21న పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జులై 7న TG ICET 2025 ఫలితాలను విడుదల చేస్తారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification