
25 బెర్తుల కెపాసిటీతో తల సేమియా బాధితుల కోసం తలసేమియా సెంటర్ ప్రారంభిం చడం చాలా ఆనందంగా ఉంది. తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా ఉంటామన్న భరోసా కల్పిద్దామని పిలుపునిచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఎస్ఎస్ తమన్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి 15న విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్లో తలసేమియా సెంటర్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాము. ఇవాళ 25 బెర్తుల కెపాసిటీతో ఈ వ్యాధి బాధితుల కోసం 25 పడకలతో తలసేమియా సెంటర్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారులకు ప్రతి నెలా రక్త మార్పిడి చేయాలి. అది జరగకపొతే ప్రాణాలకే ముప్పు. అలాగే వారు వాడే మందులు కూడా చాలా ఖర్చు అవుతుంది. మనం చేసే గొప్ప సేవ రక్తదానమే. అందరూ 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరుతున్నాను. ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, విపత్తు నిర్వహణ, ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దాం. ఒక్క పరుగు వంద జీవితాల్లో వెలుగు నిస్తుంది. నేను వాళ్ళ కోసం ఎన్నో కిలో మీటర్లు పరిగెత్తడానికి రెడీ. మీరందరూ కూడా రెడీ అయి ఈ రన్లో పాల్గొనమని కోరుతున్నాను’ అని అన్నారు.
‘భువనేశ్వరి డెడికేషన్తో మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకష్ణ, లోకేష్ ముందు పెర్ఫామ్ చేయడం మెమరబుల్ ఎక్స్పీరియన్స్. తలసేమియా సెంటర్ని ప్రారంభించడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చాలా హై ఇచ్చింది. నన్ను బలంగా నమ్మిన మేడంకి థ్యాంక్యూ. నేనెప్పుడూ ఈ గొప్ప కార్యక్రమానికి సపోర్ట్గా ఉంటాను. ఒక లయన్ లేడీగా ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఆవిడ చేయడం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. నేను ఎప్పటికీ మేడమ్కి సపోర్ట్గా ఉంటాను. ఈ కార్యక్రమం గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు. మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో జరిగే రన్లో అందరూ పాల్గొని తలసేమియా బాధితులకు సపోర్టుగా నిలవాలని కోరుకుంటున్నాను. నా జీవితాంతం కలిసేమియా బాధితులకు అండగా ఉంటాను’ అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పారు.