డిగ్రీ అర్హతతో.. యూనియన్‌ బ్యాంక్‌లో 2691 ఖాళీలు.. అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభం

Written by RAJU

Published on:

Union Bank 2691 Apprentice Recruitment 2025 : యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే..

హైలైట్:

  • యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2025
  • 2691 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల
  • మార్చి 5 దరఖాస్తులకు చివరితేదీగా నిర్ణయం

Samayam Teluguయూనియన్‌ బ్యాంక్‌ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
యూనియన్‌ బ్యాంక్‌ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ 2025

Union Bank Apprentice Recruitment 2025 : ముంబైలోని యూనియన్‌ బ్యాంక్‌ (Union Bank) దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ (apprenticeship) ఖాళీల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2691 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇప్పటకే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 5 దరఖాస్తులకు చివరితేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌, పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇతర బ్యాంక్‌ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

రాష్ట్రాల వారిగా అప్రెంటిస్‌ ఖాళీలు : 2691

  • తెలంగాణ- 304
  • ఆంధ్రప్రదేశ్‌- 549
  • కర్ణాటక- 305
  • తమిళనాడు- 122
  • కేరళ- 118
  • ఒడిశా- 53
  • మహారాష్ట్ర- 296

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
  • వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  • స్టైపెండ్: ఎంపికైన వారికి నెలకు రూ.15,000 ఉండాలి.
  • దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఈ ఖాళీలకు ఎంపిక చేయనున్నారు.
  • దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2025

BOB : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 518 ఉద్యోగాలు

Bank of Baroda Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్‌ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. BOB నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 518 ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో (Apply Online) అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 11 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవడానికి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification