చాలా మంది తలనొప్పి, జ్వరం వంటి ఇతర సాధారణ సమస్యలకు మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే మీరు తీసుకునే ట్యాబ్లెట్స్ను ఎప్పుడైనా గమనించారా? వాటిపై మధ్యలో అడ్డంగా గీతలు ఉంటాయి. బహుశా టాబ్లెట్ మధ్యలో ఈ లైన్ చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ గీతల వెనుక అసలు రహస్యం తెలుసా? అన్ని టాబ్లెట్లలో ఈ విధంగా ఎందుకు ఉండదో.. ఆ వివరాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక రోగికి ఒక నిర్దిష్ట ఔషధాన్ని సూచించేటప్పుడు వైద్యులు వారికి మోతాదును నిర్ణయిస్తారు. అటువంటి మందులన్నింటికీ మధ్యలో ఒక గీత ఉంటుంది. తద్వారా రోగి మందులు తీసుకునేటప్పుడు దానిని సగానికి సులభంగా విరగ్గొట్టవచ్చు.
ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే.. వైద్యులు ఉదయం సగం మందు, మధ్యాహ్నం సగం మందు తీసుకోవాలని చెప్పడం కూడా మనం చేలాసార్లు చూశా. నిజానికి ఈ లైన్ ఒక ట్యాబ్లెట్ను రెండు భాగాలుగా విభజించడానికి ఉపయోగించబడుతుంది.
అయితే అన్ని మందులపై ఈ గుర్తు ఉండదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే, గుర్తు లేని మందులు విభజించడానికి వీలులేదు. వీటిని ఖచ్చితంగా పూర్తిగా తీసుకోవాల్సిందే.
గీతలేని ట్యాబ్లెట్స్ను రెండుగా విభజించడం ప్రమాదకరం. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఒక నిద్ర మాత్ర పవర్ 5 అనుకుందాం.. దానిపై అడ్డుగా తీత ఉంటే దానిని విభజించడం ద్వారా దాని పవర్ సగానికి తగ్గించవచ్చు. ఒకవేళ ట్యాబ్లెట్ మీద పవర్ 5 అని రాసి ఉండి, అడ్డగీత లేకపోతే.. దానిని మొత్తం తీసుకోవడం మంచిది. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఈ రకమైన మందులను సూచిస్తారన్నమాట.