టీఎస్‌ ఇంటర్‌ రిజల్ట్స్‌ 2025,Manabadi TS Inter Outcomes 2025 : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలకు TSBIE ఏర్పాట్లు.. ఎప్పుడంటే? – ts intermediate outcomes 2025 tsbie inter 1st yr 2nd yr end result quickly at tgbie cgg gov in

Written by RAJU

Published on:

TSBIE Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Samayam Teluguటీఎస్‌ ఇంటర్‌ ఫలితాలు 2025
టీఎస్‌ ఇంటర్‌ ఫలితాలు 2025

TS Intermediate Results 2025 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. మూల్యాంకనం, కంప్యూటరీకరణ, రీవెరిఫికేషన్‌ వంటి అంశాలు వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. ఇవన్నీ అని పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ నెలాఖరున విడుదల చేయనున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం మేరకు ఏప్రిల్‌ 25వ తేదీన ఇంటర్ ఫలితాలను బోర్డు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొంత ముందుగానే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈసారి ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

కాగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలన్నింటికీ వేసవి సెలవులు కూడా ఇచ్చేశారు. జూన్‌ 1వ తేదీ వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. అనంతరం జూన్‌ 2వ తేదీ నుంచే జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడించారు. త్వరలోనే పదో తరగతి ఫలితాలు కూడా విడుదల చేసేందుకు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు కసరత్తు చేస్తోంది.

TS SSC Results 2025 : తెలంగాణ టెన్త్‌ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణలో మార్చి 21వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీతో ముగిశాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షలు రాసినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో కొశ్చన్‌ పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో.. తెలంగాణ ఎస్‌స్‌సీ బోర్డు ముూల్యాంకనం వేగంగా నిర్వహిస్తోంది. పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఏప్రిల్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహించనుంది.

అనంతరం మరోసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రీచెక్‌ చేసి 10th Class ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి మూల్యాంకనం తర్వాత మరో వారం పదిరోజులు పడుతుంది. అనంతరం ఏప్రిల్‌ నెలాఖరులో టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://bse.telangana.gov.in/ ద్వారా తమ ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అంతే కాకుండా https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకుంటూ ఉంటారు. తొలుత తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. అనంతరం టెన్త్‌ క్లాస్‌ రిజల్ట్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights