టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 2 రిజల్ట్‌ 2025,TSPSC Group 2 Results 2025 : మార్చి 11న తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల – tspsc group 2 result 2025 date expected

Written by RAJU

Published on:

TGPSC Group 2 Result 2025 Date : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ 2 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యంతరాల గడువు జనవరి 22తో ముగియనుంది.

Samayam Teluguటీజీపీఎస్సీ గ్రూప్‌ 2 రిజల్ట్స్‌ 2025
టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 రిజల్ట్స్‌ 2025

TSPSC Group 2 Result 2025 Date : TGPSC Group 2 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించింది. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించింది. మొత్తం 783 ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రూప్‌ 2 ఆన్సర్‌ కీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ పై అభ్యంతరాలకు గడువు జనవరి 22తో ముగిసింది. ఈ క్రమంలో ఫలితాల విడుదల కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ TGPSC Group 2 ఫలితాలను విడుదల చేయడానికి TGPSC కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 ఫలితాలు మార్చి 11న విడుదల చేయనుట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మొదట టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ TGPSC గ్రూప్‌ 3 ఫలితాలు జనవరి నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం TGPSC గ్రూప్‌ 2 ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత రానుంది.

TSPSC Group 2 Cut Off Marks (Expected)

TSPSC గ్రూప్ 2 పరీక్షలో మొత్తం 4 పేపర్‌లు ఉన్నాయి. అందులో ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉన్నాయి. అంటే పరీక్ష మొత్తం మార్కులు 600. పరీక్షలో విజయం సాధించినట్లు ప్రకటించడానికి ఒక అభ్యర్థి కటాఫ్ మార్కులు లేదా అంతకంటే ఎక్కువ పొందాలి. TSPSC విడుదల చేసిన TGPSC గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ ప్రకారం.. ఓపెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థికి ప్రతి పేపర్‌లో కనీస అవసరం 40 శాతం స్కోర్, వెనుకబడిన తరగతుల వ్యక్తులకు కనీస అవసరం 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 30 శాతం స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది. ఈసారి కటాఫ్‌ మార్కులు ఈ విధంగా ఉండొచ్చని అంచనా..

  • OC: 460- 470
  • BC: 455- 465
  • SC: 440- 450
  • ST: 442- 447
  • PH: 416- 425

మరోవైపు గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను సైతం ఫిబ్రవరి ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గ్రూప్‌ 1 నియామక ప్రక్రియను మార్చి నెలాఖరులోపు పూర్తి చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టీజీపీఎస్సీ కమిషన్‌ కార్యాచరణ ఉండే అవకాశం ఉంది.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification