ABN
, Publish Date – Mar 18 , 2025 | 04:52 AM
టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రెండు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించిన తొలి జెండాను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పునరావిష్కరించారు.

టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రెండు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించిన తొలి జెండాను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పునరావిష్కరించారు. ఈ జెండా గుర్తుపై నర్సంపేట, నల్లబెల్లి స్థానం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇప్పటి వరకు దాన్ని తన వద్ద దాచుకున్నారు. రైతు, నాగలి గుర్తుతో రూపొందించిన ఈ జెండాను పెద్ది సుదర్శన్రెడ్డి కేసీఆర్కు అందజేశారు. 25 ఏళ్ల సిల్వర్జూబ్లీ వేడుకల నేపథ్యంలో సోమవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్ దాన్ని పునరావిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఉద్యమ కాలంనాటి పాతజ్ఞాపకాలను నెమరువేసుకొని, పార్టీ పురోగతి, తెలంగాణ సాధన వంటి విషయాలను పార్టీ నేతలతో పంచుకున్నారు.
Updated Date – Mar 18 , 2025 | 04:52 AM