
గొంతు నొప్పి వాపు వంటి సమస్యలు వాతావరణ మార్పుల వల్ల తరచూ వస్తుంటాయి. అటువంటి పరిస్థితుల్లో లవంగాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే గొంతు సాఫీగా మారుతుంది. దీనివల్ల గళనాళంలో చేరిన క్రిములు తగ్గిపోతాయి. గట్టిగా మాట్లాడాలిసినవాళ్లు లేదా చల్లదనానికి లోనయ్యే వ్యక్తులకు ఇది చక్కని ఉపశమనం ఇస్తుంది.
తేనెలో సహజ మాధుర్యం, లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కలిసి శరీరాన్ని క్రిముల నుండి రక్షించగల శక్తిని అందిస్తాయి. దీనివల్ల తరచూ జలుబు దగ్గు వచ్చే వారి సమస్యలు తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవాళ్లు ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు తీసుకుంటే మంచిది.
లవంగాల్లో ఉండే కొవ్వు కరిగించే లక్షణాలు తేనెతో కలిసినప్పుడు మెరుగైన ఫలితాలు ఇస్తాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తూ శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు తగ్గించడానికి సహజమైన ఈ మార్గం ప్రయోజనం ఇస్తుంది.
నోటిలో వచ్చే పూతలు, చెడు వాసనను ఈ మిశ్రమం ద్వారా తగ్గించవచ్చు. లవంగాల్లో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు నోటి లోపలున్న బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. తేనె ఈ గుణాలను శక్తివంతం చేస్తుంది. దీనివల్ల నోటి శుభ్రత కాపాడటంలో ఉపయోగపడుతుంది.
శీతాకాలంలో లేదా వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు ఇబ్బందిని తగ్గించడంలో తేనె లవంగాల కలయిక ఉపశమనం ఇస్తుంది. దీనిని వేడి నీటితో కలిపి తాగితే గొంతులోని ఉబ్బరం తగ్గిపోతుంది. చిన్నారులు పెద్దలు ఎవరు అయినా సరే ఈ మిశ్రమాన్ని సురక్షితంగా వాడవచ్చు.
లవంగాలు ఊపిరితిత్తుల్లో ఉండే మలినాలను బయటకు తీసేందుకు సహాయపడతాయి. తేనె ఈ లక్షణాన్ని బలోపేతం చేస్తూ శ్వాస మార్గాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఇది సహజ మార్గంగా పనిచేస్తుంది.
తేనె లవంగాలను కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి ఆంతరిక శుద్ధి కలుగుతుంది. వేసవి గాని శీతాకాలం గాని అని తేడా లేకుండా ఈ మిశ్రమం ఎన్నో సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఇది రోజూ తక్కువ మోతాదులో తీసుకుంటే ప్రమాదం లేకుండా శరీరానికి మేలు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)