రూ.లక్షకు చేరువలో ధర
న్యూఢిల్లీ: పసిడి మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం ధర రూ.లక్షకు చేరువవుతోంది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ.98,100కు చేరింది. మంగళవారంతో పోలిస్తే ఇది రూ.1,650 ఎక్కువ. కిలో వెండి ధర సైతం రూ.1,900 లాభంతో రూ.99,400కు చేరింది. ఈ నెల 11 తర్వాత పసిడి ధర ఒకే రోజు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ పసిడి ధర మండుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం రికార్డు స్థాయిలో 3,328 డాలర్లకు చేరింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.18,710 (23.56 శాతం) పెరిగింది. పసిడి ధర చుక్కలంటడానికి ఈ కింది అంశాలు ప్రధానంగా దోహదం చేస్తున్నాయి.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు
పెట్టుబడిగా పెరిగిన పసిడి కొనుగోళ్లు.
ఆర్బీతో సహా అనేక కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.
పెరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ ఉద్రికత్తలు.
ఇవి కూడా చదవండి:
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News