‘కరోనా టైంలో నాకు ప్రతీ రోజూ ఓ కల వస్తూనే ఉండేది. అది నన్ను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించింది. అలా ఆ కలలో వచ్చిన పాయింట్ మీదే కథ రాసుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా మా ‘డియర్ ఉమ’ చిత్రం ఉంటుంది’ అని హీరోయిన్, రచయిత, నిర్మాత సుమయ రెడ్డి చెప్పారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది.
పథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
సినిమా రిలీజ్ నేపథ్యంలో సుమయ రెడ్డి మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.
మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఇటు వైపు వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం.
ఈ చిత్ర కథ కొంచెం ఫిక్షనల్. కొంచెం రియల్. సోషల్ మెసేజ్ అని కాకుండా ఓ సొల్యూషన్ని కూడా చెబుతాం. అందరికీ అవగాహన కల్పించేలా చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో వైద్య రంగం మీద విమర్శలు గుప్పించారనే అనే కామెంట్స్ వినిపించాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే వాటిని చూపించబోతున్నాం. డాక్టర్లు, పేషెంట్స్కి మధ్యలో ఉండే పర్సన్స్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో చూపించాం.
ఇందులో తొలుత తెలుగు హీరోని ట్రై చేశాం. కానీ చాలా కారణాల వల్ల మిస్ అవుతూ వచ్చాం. అయితే పథ్వీ అంబర్ కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. ఆయన చాలా అద్భుతంగా నటించారు.
దర్శకుడు సాయి రాజేష్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. నా దగ్గరున్న ఈ కథను ఆయనకు చెబితే, ఆయనకు చాలా నచ్చి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకు రథన్ మ్యూజిక్ ప్రాణం. కెమెరామెన్ రాజ్ తోట విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఈనెల 18న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి.

కార్పొరేట్ హాస్పిటల్స్ నేపథ్యంలో..

Written by RAJU
Published on: