
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని 18 వ వార్డులో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి దంపతులు పాల్గొన్నారు.అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,18 వ వార్డు ప్రజలు,పలువురు పాల్గొన్నారు.