ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025,Nara Lokesh : త్వరలో ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేశ్‌ – minister nara lokesh gives clarity on ap dsc notification 2025

Written by RAJU

Published on:

AP Mega DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 ఊరిస్తోంది. అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేశ్‌ స్పష్టత ఇచ్చారు.

Samayam Teluguమంత్రి నారా లోకేశ్‌ - ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025
మంత్రి నారా లోకేశ్‌ – ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025

Minister Nara Lokesh on AP DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ తయారు చేసింది. తాజాగా మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్‌ స్పష్టత ఇచ్చారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా స్కూళ్లలో ప్రహరీల నిర్మాణం, మెగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించారు.

అలాగే.. Andhra Pradesh రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలను పూర్తి చేయాలంటే రూ.3000 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మన బడి- మన భవిష్యత్తు.. నినాదంతో ఉపాధి హమీ కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ‘డ్రగ్స్ వద్దు బ్రో’.. అనే క్యాంపెయిన్‌ను ప్రభుత్వం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతి స్కూల్‌, కాలేజీల్లో ‘ఈగల్’ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని.. పేరెంట్‌- టీచర్‌ మీటింగ్‌లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు వేస్తున్నామని పునరుద్ఘాటించారు. మరోవైపు 117 జీవోకు ప్రత్యామ్నాయంపై సభ్యులతో చర్చించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు వెళతామని అన్నారు.

అయితే.. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ మార్చి నెల‌లోనే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను ఎలాంటి చిక్కులు, అడ్డంకులు ఉండ‌కుండా జారీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనలో మొత్తం 16,371 టీచ‌ర్ పోస్టులు ఉండ‌నున్నాయి. అందులో 6,371 సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్లు, 7,725 స్కూల్ అసిస్టెంట్లు, 1,781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 286 పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు, 52 ప్రిన్సిపాళ్ల పోస్టులు, 132 వ్యాయామ టీచ‌ర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల ఏపీ డీఎస్సీ సిలబస్‌ విడుదల చేసింది.

అయితే.. ఈ డీఎస్సీ నియామక ప్రక్రియను మార్చి నెలలో ప్రారంభించి.. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) ప్రారంభం నాటికి పూర్తి చేసే యోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు మార్లు స్పష్టం చేశారు. జూన్‌ నెలలో స్కూళ్లు రీఓపెన్‌ చేసే నాటికి టీచర్ల రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే.. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification