ఏపీ ఇంటర్‌ షార్ట్‌ మెమోలు,BIEAP Inter Marks Memo 2025 : ఏపీ ఇంటర్‌ షార్ట్‌ మెమోలు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే – ap inter marks memo 2025 obtain hyperlink at bie ap gov in

Written by RAJU

Published on:

AP Inter Short Memo Download 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్‌. ఫెయిలైన వారి కోసం సప్లిమెంటరీ పరీక్ష తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈక్రమంలో..

Samayam Teluguఏపీ ఇంటర్‌ షార్ట్‌ మెమోలు
ఏపీ ఇంటర్‌ షార్ట్‌ మెమోలు

AP Inter Marks Memo 2025 : ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ మార్కుల మోమోను ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు వివరాలను ఎంటర్ చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఇటీవల ఇంటర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన బోర్డు.. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే.. ఏప్రిల్‌ 22 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లయ్‌ చేసుకోవచ్చని కూడా ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇంటర్‌ షాట్‌ మోమోలు.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ క్లిక్‌ చేయండి
  • హోంపేజీలో కనిపిస్తున్న మోమో అప్షన్‌ను ఎంపిక చేసుకోండి
  • మీ రోల్‌నెంబర్‌, కోర్సు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్‌ చేయండి
  • వివరాలు ఎంటర్‌ చేసి మోమో డౌన్‌లోడ్‌ అనే అప్షన్‌పై క్లిక్‌ చేయండి
  • తర్వాతి స్క్రీన్‌లో మీకు మోమో డిస్‌ప్లే అవుతుంది
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఫలితాలను పరిశీలిస్తే.. ఇంటర్ మొదటి సంవత్సరం 70 శాతం మంది ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 73 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు నిలిచాయి. విద్యార్థులు వాట్సాప్ మన మిత్ర ద్వారా లేదా https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తమ రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

మే 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు:

అయితే.. ఇంటర్మీడియట్‌ ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా విడుదల చేశారు. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 28వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష జూన్‌ 4వ తేదీన, పర్యావరణ విద్య జూన్‌ 6వ తేదీన నిర్వహించనున్నారు. ఇక ఫెయిలైన విద్యార్థులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించవచ్చు. ఏప్రిల్‌ 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సప్లిమెంటరీ ఎగ్జామ్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights