అందరూ అర్హులే…
ఆఫ్ లైన్ లో కోచింగ్ కు వెళ్లలేని గృహిణులు, సుదూర ప్రాంతవాసులతో పాటు ఇతరులకు లబ్ధి చేకూర్చేలా ఆన్ లైన్ కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. దరఖాస్తు చేసుకున్న బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికీ ఉచిత కోచింగ్ అందజేస్తామన్నారు. ప్రస్తుతం 3,189 మంది దరఖాస్తులొచ్చాయన్నారు. ఇంకెంతమందైనా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ ఉచిత కోచింగ్ అందజేస్తామన్నారు.