ఏపీలోని కొన్ని జిల్లాలో మండే ఎండలు.. ఇంకొన్ని జిల్లాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్ – Telugu Information | Examine Out Newest Andhra Climate Report

Written by RAJU

Published on:

శుక్రవారం (2-03-25) శ్రీకాకుళం జిల్లా-12, విజయనగరం-16, పార్వతీపురం మన్యం-13, అల్లూరి సీతారామరాజు-1, కాకినాడ-2, తూర్పుగోదావరి-5 మండలాల్లో(49) వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం అల్లూరి జిల్లా చింతూరు, మన్యం జిల్లా సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

వైఎస్సార్, నంద్యాల , ప్రకాశం , పల్నాడు జిల్లాల్లో ఆదివారం చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.

గురువారం నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.3°C, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 40.2°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 40.1°C, అన్నమయ్య జిల్లా గాదెల మరియు విజయనగరంలో 40°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, అలాగే 30 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు..

ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification