
పహల్గాం ఉగ్రదాడిలో నేపథ్యంలో యావత్ దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో చెన్నై లోని అరకోణం లో జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్వే ట్రాక్ బోల్ట్లను తొలగించారు. కానీ, అదృష్టవశాత్తు రైల్వే అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
దీంతో ఆ ట్రాక్పై ప్రయాణించే పలు రైళ్లను బెంగళూరు, కేరళ వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలోనే పలు ట్రైన్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆకతాయిలు చేసిన పనా..? లేదంటే, ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీ సేకరించారు. వాటి అధారంగా విచారణ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..