-
గత బడ్జెట్లో 49,315 కోట్ల కేటాయింపు.. ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో రూ.56,083 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ఇదే పథకాలకు చేసిన కేటాయింపులు రూ.49,315 కోట్లు కాగా చేసిన ఖర్చు చూస్తే రూ.24,948కోట్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి గత ఏడాది బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినప్పటికీ రూ.52.90 కోట్లు ఖర్చు చేసింది. చేయూత పథకానికి గత బడ్జెట్లో రూ.14,861 కోట్ల ప్రతిపాదించగా.. రూ.12 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.9184కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది లేదు. రైతు భరోసాకు గత బడ్జెట్లో రూ.15 వేల కోట్ల ప్రతిపాదించగా.. మార్చి 31 నాటికి రూ.7500 కోట్లు ఖర్చు చేయనుంది. ఇదే పథకానికి ఈ సారి రూ.18వేల కోట్లను ప్రకటించింది.
పథకం కేటాయింపు
మహాలక్ష్మి 4,305
గృహజ్యోతి 2,080
సన్న ధాన్యానికి బోనస్ 1,800
రాజీవ్ ఆరోగ్యశ్రీ 1,143
గ్యాస్ సిలిండర్ రాయితీ 723
ఆత్మీయ భరోసా 600
ఇందిరమ్మ ఇళ్లు 12,571
చేయూత 14,861
రైతు భరోసా 18,000
Updated Date – Mar 20 , 2025 | 05:35 AM