ABN
, Publish Date – Apr 25 , 2025 | 11:55 PM
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు.

సారా తయారీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
1,120 లీటర్ల సారా స్వాధీనం
10,600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
పాతపట్నం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. శ్రీకాకుళం డీపీఈవో సీహెచ్ తిరుపతినాయుడు, గంజాం జిల్లా ఈఎస్ ప్రదీప్కుమార్ సాహు సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రాలోని పాతపట్నం, కొత్తూరు మండలాల ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఒడిశా గ్రామాలైన సింగుపురం, నేరేడిగూడ, శిరడా, గురిసింగి గూడ తదితర గిరిజన గూడలతో పాటు సమీపంలోని కొండలపై గ్రామాల్లోనూ ముమ్మరంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా సుమారు 10,600 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసి 1,120 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తిరుపతినాయుడు తెలిపారు. జిల్లా సహాయ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జి ఏఈఎస్ ఎం.శ్రీనివాసరావు, పాతపట్నం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కోట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date – Apr 25 , 2025 | 11:55 PM